గ్రూప్ 1 నియామకాలపై హై కోర్టులో విచారణ వాయిదా!

by Ajay Maddhiboyina |

గ్రూప్ 1 నియామకాలపై టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. గత విచారణలో గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును డివిజిన్ బెంచ్ సస్పెండ్ చేసిన అనంతరం విచారణ వాయిదా వేసింది.

గ్రూప్ 1 నియామకాలపై హై కోర్టులో విచారణ వాయిదా!
X

దిశ‌, వెబ్ డెస్క్: గ్రూప్ 1 నియామకాలపై టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. గత విచారణలో గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును డివిజిన్ బెంచ్ సస్పెండ్ చేసిన అనంతరం విచారణ వాయిదా వేసింది. ప్రతి వాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలలో పేర్కొంది. కౌంటర్ దాఖలుపై బుధవారం జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా ప్రతి వాదులు రిట్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు సమయం కోరగా నవంబర్ 18కి విచారణ వాయిదా వేస్తూ హై కోర్టు ఆదేశిలిచ్చింది. తదుపరి విచారణ వరకు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.

Next Story