బీబీ నగర్​ఎయిమ్స్​ పీహెచ్​సీ స్థాయిలో లేదు.. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు

by Dishafeatures2 |
బీబీ నగర్​ఎయిమ్స్​ పీహెచ్​సీ స్థాయిలో లేదు.. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీబీనగర్​ ఎయిమ్స్​ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ వైద్యం అందించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు విమర్శించారు. పేదలకు మేలు జరుగుతుందని ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించినా..ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గతంలో బీబీనగర్ ఎయిమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకున్నారని, ఆధారాలు చూపిస్తే నోట మాట లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీ లోని తమ పీహెచ్సీ స్థాయిలో లేదు? అని మంత్రి ప్రశ్నించారు.రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, కేవలం రూ. 156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారన్నారు. కానీ 2018 లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్ కి కేంద్రం 52% నిధులు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. దీని ప్రకారం తెలంగాణ పై కేంద్రం వివక్ష స్పష్టంగా అర్థం అవుతుందని మంత్రి ట్విట్టర్​వేదికగా ఫైర్​అయ్యారు.

‘‘మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం.రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణ కు ఇవ్వకుండా కేంద్రం మొండి చేయి చూపింది. ఒకటో ఫేస్ , రెండో ఫేస్ లో ఇవ్వలేదు. దీంతో గట్టిగా ప్రశ్నిస్తే మూడో ఫేస్ లో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం.ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజ్ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయాం అని చెబుతారు.

ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు?ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు.? కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రం సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్​ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా? ఈ అన్యాయాల గురించి ఎందుకు ఒక్కరు మాట్లాడరు? ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయరు?? ఏపీ పునర్ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారు అవుతారు.”అంటూ మంత్రి హరీష్​రావు ట్విట్వర్​వేదికగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed