అర్ధరాత్రి మాజీ మంత్రి మేనల్లుడు హల్‌చల్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 2 |
అర్ధరాత్రి మాజీ మంత్రి మేనల్లుడు హల్‌చల్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ ఫోరమ్ మాల్ సర్కిల్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ అగ్రజ్ అనే యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్‌తోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అగ్రజ్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయగా.. మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించారు.

దీంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన అగ్రజ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అవుతాడని తెలిసింది. అయితే, ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధుల ఫ్యామిలీలకు చెందిన వ్యక్తులు అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇదే తరహాలో అతివేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన విషయం తెలిసిందే. దీంతో సామాన్య జనాలు సీరియస్ అవుతున్నారు.



Next Story

Most Viewed