బీజేపీ వార్నింగ్‌తోనే అంబేడ్కర్ విగ్రహం పూర్తి.. : బండి సంజయ్

by Disha Web Desk 4 |
బీజేపీ వార్నింగ్‌తోనే అంబేడ్కర్ విగ్రహం పూర్తి.. : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. బీజేపీ వార్నింగ్ ఇస్తేనే విగ్రహం పూర్తయిందన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అంబేడ్కర్ చిత్రపటానికి బండి నివాళులు అర్పించారు. సీఎం, ఆయన కుటుంబం అంబేడ్కర్ ను గౌరవించలేదన్నారు. సీఎం దళిత ద్రోహి అన్నారు. దళిత బంధుపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పీవీ నర్సింహరావు విషయంలో ఇలానే చేశారని తర్వాత ఆయనను విస్మరించారన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందన్నారు.

Next Story

Most Viewed