ఎస్పీడీసీఎల్ లో హరితోత్సవం

by Dishafeatures2 |
ఎస్పీడీసీఎల్ లో హరితోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సంస్థ సీఎండీ రఘుమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భముగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజల్లో సైతం పచ్చదనంపై చైతన్యం తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు.

హరితోత్సవం సందర్భంగా సంస్థ పరిధిలోని అన్ని జోనల్, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో మొక్కలు నాటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీనివాస్, రాములు, మదన్ మోహన్ రావు, నరసింహ రావు, స్వామి రెడ్డి, గోపాల్, మురళీధర్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.



Next Story