- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : గొంగడి త్రిషకు హరీష్ రావు స్పెషల్ విషెస్
ఐసీసీ అండర్ -19 టీ20(ICC U19 Women's T20) వరల్డ్ కప్(World Cup) విజేతగా నిలిచిన టీమిండియా(Team Inida) జట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ అండర్ -19 టీ20(ICC U19 Women's T20) వరల్డ్ కప్(World Cup) విజేతగా నిలిచిన టీమిండియా(Team Inida) జట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారతదేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గెలుపు మహిళా క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, దృఢ సంకల్పాన్ని లోకానికి ఛాటి చెబుతుంది అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాచలం యువతి గొంగడి త్రిష(Gongadi Trisha).. ఈ టోర్నీలో 300 కంటే ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా త్రిషకు హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు. గొంగడి త్రిష తెలంగాణ భవిష్యత్ తరాల క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అయితే మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు (8×4) చేసి నాటౌట్గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23). నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత జట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు. కాగా భారత మహిళల జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






