AP ప్రజల పక్షాన మాట్లాడాను.. ఒక్కమాట అనలేదు: హరీశ్ రావు

by Disha Web Desk 2 |
AP ప్రజల పక్షాన మాట్లాడాను.. ఒక్కమాట అనలేదు: హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైరయ్యారు. ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడాను అంటున్నారు.. కానీ, అది అవాస్తవం అని కొట్టిపారేశారు. ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానని.. ఎవరినీ ఒక్కమాట అనలేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేక.. ఏపీ మంత్రులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ముందు విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంలపై ఫైట్ చేయాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయని సూచించారు.

Next Story