Breaking News : పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు

by Muthe.Rajitha |   (  Updated:2024-12-18 13:23:16  IST  )

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల రైతుల దాడి ఘటన(Lagacharla Incident) గురించి తెలిసిందే.

Breaking News : పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల రైతుల దాడి ఘటన(Lagacharla Incident) గురించి తెలిసిందే. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) ఏ1(A1) నిందితుడిగా చేర్చుతూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2(A2) గా సురేష్(Suresh) సహ మరో 24 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో నేడు పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు(Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా సురేష్ తో మహా మిగిలిన 24 మందికి కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. పట్నంకు రూ.50 వేల పూచీకత్తు విధించగా, మిగిలిన వారికి రూ.20 వేల పూచీకత్తు విధిస్తూ కోర్ట్ ఈ బెయిల్ మంజూరు చేసింది.

Next Story