అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి నివాళులు

by Ramesh Naini |   (  Updated:2025-12-16 06:53:22  IST  )

అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి నివాళులు అర్పించారు.

అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి నివాళులు అర్పించారు. ఇవాళ (మంగళవారం) విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క త్రివిధ దళాల అధికారులు గౌరవ వందనం చేశాయి.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. 1971లో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వమైన ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ విముక్తి సాధించిన రోజు విజయ్ దివస్ చరిత్రలో గర్వించదగిన రోజు అని తెలిపారు. యుద్ధ సమయంలో దేశ ఔన్నత్యాన్ని కాపాడిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి, సైనిక నాయకులకు, అమర జవాన్లందరికీ డిప్యూటీ సీఎం వందనాలు తెలిపారు.

Next Story