- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంధ విద్యార్థులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన CM రేవంత్
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణను అందజేశారు.

దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణను అందజేశారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులు లైవ్లో పాట పాడి వినిపించారు. ఆ తర్వాత వారు పాడిన పాటల సీడీని ఆవిష్కరించిన సీఎంతో పాటు మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డిని కలిసిన సీఎం సహాయనిధి లబ్ధిదారుడు..
వరంగల్ జిల్లా దామెర మండల పరిధిలోని పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ (Gundeti Rahul) ఇటీవలే రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళ్తుండగా అతడిని కొందురు దుండగులు రైలులోంచి తోసేయగా రెండు కాళ్లను కోల్పోయాడు. దీంతో రాహుల్కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు ప్రభుత్వం సాయం చేసింది. ఈ మేరకు రాహుల్ ఇవాళ కటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు






