- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramachander Naik: ప్రజాప్రతినిధుల మాటలను వక్రీకరించడం సరికాదు
by Gantepaka Srikanth |
ప్రజా ప్రతినిధుల మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రతినిధుల మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఉద్దేశంతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వివరించారు. ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూడలేకనే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల మాటలను వక్రీకరించి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా దళిత, గిరిజన ఎమ్మెల్యేలను కలవానే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇచ్చినట్టు విప్ వెల్లడించారు.
Next Story






