- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేత
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్(Aadhaar Link) చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది. కాగా, ‘ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్, సెల్ఫోన్ నంబర్లు వివరాలు ఇవ్వనివారికి ఈ నెల జీతం రాదు’ అని ఇప్పటికే ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వశాఖల అధిపతులను హెచ్చరించింది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్(IFMIS)లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలివ్వనివారి జీతాల బిల్లులు నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని లేకపోతే.. ఇదే ట్రీట్మెంట్ అమలు అవుతుందని హెచ్చరించింది.






