- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల సర్వే నివేదిక విడుదలకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
తెలంగాణలో 97.10 శాతం కుల సర్వే పూర్తయిందని, త్వరలోనే నివేదిక విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే తుది నివేదికను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఇవాళ రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళ్లి వివరాలు సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 97.10 శాతం సమగ్ర సర్వే పూర్తయిందని, మిగిలిన స్వల్ప శాతాన్ని కూడా త్వరితగతిన క్రోడీకరిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ‘సెల్ఫ్ డిక్లరేషన్’ (Self Declaration) పద్ధతిలో అత్యంత పకడ్బందీగా నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
లక్ష మందికి పైగా సిబ్బందితో..
కులగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సుమారు 1.3 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిని వినియోగించిందని మంత్రి పొన్నం వివరించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా కేవలం గణాంకాల ఆధారంగానే ఈ సర్వే నిర్వహించామని చెప్పారు. నిష్పాక్షికంగా జరిగిన ఈ ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కుల గణన దేశానికే ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం చేకూర్చడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘మా ప్రభుత్వం సేకరించిన ఈ విలువైన డేటాను కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ఈ నివేదిక దిక్సూచిగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నివేదిక విడుదలైన అనంతరం గణాంకాల ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.






