కొత్త రేషన్ కార్డులపై సర్కార్ అధికారిక ప్రకటన

by Disha Web Desk 2 |
కొత్త రేషన్ కార్డులపై సర్కార్ అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. అన్ని శాఖల అధికారులతో మంత్రులంతా వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిస్థితి తెలుసుకుంటున్నారు. తాజాగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోస డిసెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. తప్పులు సరిచేసేందుకు ప్రతి ఊళ్లో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. ఆ గ్రామ సభల్లోనే పెన్షన్లు, ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed