- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్యాక్స్ కట్టేవారిపై సర్కార్ డేగకన్ను.. ‘లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ ఏర్పాటు
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో భారీ పన్ను చెల్లింపుదారుల పర్యవేక్షణ కోసం ‘లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ (LTU) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అత్యధికంగా పన్ను చెల్లింపుదారుల పర్యవేక్షణ కోసం ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థాయిలో లార్జ్ ట్యాక్స్ ఫేయర్స్ యూనిట్(ఎల్టీయూ)ను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ యూనిట్కు జాయింట్ కమిషనర్ లేదా అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఎస్జీఎస్టీ చెల్లించేవారు, భారీగా జీఎస్టీ రీఫండ్ క్లెయిమ్ చేసేవారు, మద్యం, పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం చేసే ప్రధాన వ్యాట్ పన్ను చెల్లింపుదారులను ఈ యూనిట్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాబితాను సవరించనున్నారు. దీంతో పాటు వాణిజ్య పన్నుల శాఖలో 19 డివిజన్లు, 121 సర్కిళ్లు ఉన్నాయి. అయితే, అబిడ్స్ ఎస్టీయూ-3, పంజాగుట్ట ఎస్టీయూ-3, బేగంపేట ఎస్టీయూ-3, వరంగల్ ఎస్టీయూ-2 పోస్టులను కొత్తగా ఏర్పడే స్టేట్ ఎల్టీయూకి బదిలీ చేయనున్నారు. ఈ యూనిట్కు అవసరమైన డెస్క్టాప్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ కొనుగోలు కోసం 2026-27 బడ్జెట్ కేటాయింపులో భాగంగా రూ.2.61కోట్ల నిధులను కేటాయించారు.






