బ్రేకింగ్ న్యూస్.. దసరా సెలవులను మార్చిన ప్రభుత్వం..

by Disha Web Desk 9 |
బ్రేకింగ్ న్యూస్.. దసరా సెలవులను మార్చిన ప్రభుత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా సెలవులలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24ను సైతం సెలవుగా ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగ నిర్వహించుకోవాలని సూచించడంతో ప్రభుత్వం ఈ మార్పును చేసింది.

ఇక బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ప్రకటించగా దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్చిక సెలవు ఇచ్చింది. దీంతో 22వ తేదీని కలుపుకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. స్కూళ్లకు ఈనెల 13 నుంచి 25 వరకు, జూనియర్ ఇంటర్ కాలేజీలకు ఈనెల 19 నుంచి 25 రకు సెలవులు ఖరారు చేసింది. 26వ తేదీ వర్కింగ్ డే కానుంది.

Next Story

Most Viewed