జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. మేనిఫెస్టోలో T-కాంగ్రెస్ కీలక హామీలు

by Disha Web Desk 4 |
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. మేనిఫెస్టోలో T-కాంగ్రెస్ కీలక హామీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది.

మేనిఫెస్టోలో చేర్చిన హామీలివే..!

రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు..

సుదీర్ఘ కాలంగా పెండిగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడం. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాలు కేటాయించడం.

మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షల నగదు ఆర్థిక సహాయం

రిటైర్ అయిన జర్నలిస్టులకు పింఛన్

‘జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్’ ను జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్ కార్డులు జారీ చేయడం వంటి అంశాలను టీ- కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

Next Story