గోల్డ్ మెడల్ సాధించిన అక్షయ.. అభినందించిన గవర్నర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-03 17:11:07  IST  )

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో మంగళవారం వర్సిటీ 13వ కాన్వకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.

గోల్డ్ మెడల్ సాధించిన అక్షయ.. అభినందించిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో మంగళవారం వర్సిటీ 13వ కాన్వకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) చేతులు మీదుగా అవార్డులు అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సిద్దార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్‌ (కొర్రెముల)లో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో కాలేజీ టాపర్‌గా నిలిచిన బొమ్మ అక్షయ(Akshaya)కు గవర్నర్ గోల్డ్ మెడల్ అందించారు. ఆమె స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం. విద్యార్థిని గోల్డ్ మెడల్ వచ్చేలా ప్రోత్సహించిన తల్లి బొమ్మ శబరిమాత, తండ్రి బొమ్మ రవిని గవర్నర్ అభినందించారు.

Next Story