బీఆర్ఎస్కు షాక్.. కాసాని సమక్షంలో ఆ నేత టీడీపీలో చేరిక

by Dishafeatures2 |
బీఆర్ఎస్కు షాక్.. కాసాని సమక్షంలో ఆ నేత టీడీపీలో చేరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గంధం రమేష్ చేరారు. సీఎం కేసీఆర్ ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనంను ప్రారంభించి భారీ సభ పెట్టారు. అయినప్పటికీ వారం రోజులు గడువక ముందే బీఆర్ఎస్ ను రమేష్ వీడారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కండువాను రమేష్ కు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ పూర్వవైభవానికి అందరూ పాటుపడాలన్నారు. పార్టీలో కొత్తపాత తేడా అని లేకుండా అందరూ సమానమేనన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు టీడీపీ అబ్జర్వర్ బి.సంజయ్ కుమార్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య, సంగెపు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

కేసీఆర్.. టైమ్ వచ్చింది.. ఇక సామాన్లు సర్దుకో: మహేష్​ కుమార్​ గౌడ్​ ఫైర్


Next Story

Most Viewed