మలేషియా జైలు జీవితం నుంచి విముక్తి...తిరిగొచ్చిన లింగాపూర్, దస్తురాబాద్ వాసులు

by Ajay Maddhiboyina |

మలేషియా జైలులో అన్యాయంగా మగ్గిన ఆరుగురు బాధితుల్లో సోమవారం మరో ముగ్గురు స్వదేశానికి తిరిగి వచ్చారు.

మలేషియా జైలు జీవితం నుంచి విముక్తి...తిరిగొచ్చిన లింగాపూర్, దస్తురాబాద్ వాసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మలేషియా జైలులో అన్యాయంగా మగ్గిన ఆరుగురు బాధితుల్లో సోమవారం మరో ముగ్గురు స్వదేశానికి తిరిగి వచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన లింగాపూర్ వాసులు రాచకొండ నరేష్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ మలేషియా జైలు జీవితం నుంచి కేటీఆర్ చొరవతో బయటపడ్డారు. గత నెలలో ముగ్గురు బాధితులు తిరిగి రావడం, ఇప్పుడు మరో ముగ్గురు స్వదేశానికి చేరుకోవడంలో కేటీఆర్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇరుదేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయం చేస్తూ వారి విడుదలకు అవసరమైన ఖర్చులను, విమాన ప్రయాణ చార్జీలను భరించారు.

Next Story