ఇరు రాష్ట్రాల గ్రూప్ 1, 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 2 |
ఇరు రాష్ట్రాల గ్రూప్ 1, 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో నిర్వహించబోయే గ్రూప్ 1, 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇరు రాష్ట్రాల అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు ఇస్తున్నట్లు 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14వ తేదీన ఈ సదస్సు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అశోక్ నగరలోని అకాడమీలో దీన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరుకానున్నట్లు చెప్పారు. గ్రూప్ 1, 2 సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, నోట్స్ మేకింగ్, సమయపాలన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed