- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఎమ్మెల్యేలతో నలుగురు మంత్రుల కీలక చర్చ.. టాపిక్ ఏంటో తెలుసా?
హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి & మౌలిక వసతులు – రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. సంక్షేమ పథకాలు – డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఆర్థిక సహాయం, రైతు రుణమాఫీ, పంటల నష్టపరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్స్, మైనారిటీ & మహిళల అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షించారు. రాబోయే ప్రణాళికలు – యువత ఉపాధి అవకాశాలు, చిన్న & మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతు బజార్ల విస్తరణ, ఆరోగ్య రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుపైనా సుదీర్ఘంగా చర్చించారు.






