- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు?
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు, విమర్శలు చేసిందని.. సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు.
Next Story