CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం

by Disha Web Desk 2 |
CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టులు అన్యాయంగా KRMB కి అప్పగింతపై ఎందుకు మౌనంగా ఉన్నారు.. కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోనాలు తాకట్టు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, మొత్తం కేంద్ర ప్రభుత్వం రూ.47,65,768 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఎలాంటి కొత్త పథకాలు.. వరాలు.. వాతలు లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.25,639 కోట్లు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.2,239 కోట్లను పెంచింది. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు రానున్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థల గ్రాంటు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి. ఈ మూడు పెద్ద పద్దులు తప్ప రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీలేవు. దీంతో సీఎం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed