బ్రేకింగ్: కాంగ్రెస్‌లో మరో కీలక నేత జాయినింగ్.. కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కాంగ్రెస్‌లో మరో కీలక నేత జాయినింగ్.. కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి.. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు థాక్రే సమక్షంలో గాంధీభవన్‌లో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. థాక్రే, రేవంత్ రెడ్డి చంద్రశేఖర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడించడం తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అనూహ్యంగా తొలగించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed