ఏసీబీ విచారణలో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-24 17:04:39  IST  )

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) ఏసీబీ అధికారులు కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు.

ఏసీబీ విచారణలో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) ఏసీబీ అధికారులు కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఐదు రోజులు కస్టడికి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలివ్వగా బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులు మురళీధర్ రావును కస్టడికి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. సోదాలలో గుర్తించిన ఆక్రమ ఆస్తులపై ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈఎన్సీ గా భాద్యతలు ఎన్ని సంవత్సరాలు నిర్వహించారు. ఏఏ విభాగాలకు సబంధించి బిల్లులు క్లియర్ చేశారు అనే అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నది. ఏసీబీ తనిఖీలలో గుర్తించిన మురళీదర్ కు సబంధించిన బ్యాంక్ లాకర్లను నేడు తనిఖీ చేసేందుకు చర్యలు చెపట్టినట్లు తెలుస్తుంది. ఇరిగేషన్​ శాఖలో ఆయన పని చేసిన విభాగాలలో విచారణ చెపపట్టనున్నారు.

Next Story