మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేసు సనత్ నగర్‌కు బదిలీ

by Disha Web Desk 4 |
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేసు సనత్ నగర్‌కు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూకట్ పల్లి పీఎస్ గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ కేసును సనత్ నగర్ పీఎస్‌కు కూకట్ పల్లి పోలీసులు బదిలీ చేశారు. సనత్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై తాజాగా శుక్రవారం కేసు నమోదు కాగా రాధాకిషన్ రావు బెదిరింపులకు పాల్పడి.. తన కూతురి ఇంటిని రాయించుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. బాధితుడు సుదర్శన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాధాకిషన్ రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed