ముస్లింలకు మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

by Disha Web Desk 19 |
ముస్లింలకు మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఈద్ ఉల్ ఫితర్’ను పురస్కరించుకొని ముస్లింలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పామని, లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తమ పదేండ్ల పాలనలో నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. అదే సాంప్రదాయం కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed