- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తున్నాయని రైతు కమిషన్ బృందం పేర్కొంది. బుధవారం సచివాలయంలోని సీఎంవో సెక్రటరీ శేషాద్రి తో రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సమావేశమయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను అందించారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంలో ఎఫ్పీఓలు కీలకంగా పని చేస్తున్నాయని వెల్లడించారు.
రైతు కమిషన్ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్ లో పర్యటించిన సమయంలో ఎఫ్పీఓల ప్రభావం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. కేంద్రం కూడా ఎప్పీఓల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న విషయం కూడా గుర్తు చేశారు. నాసిక్ లోని సహ్యాద్రి ఎఫ్పీఓ దేశంలోనే ఆదర్శంగా పని చేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్ రూపొందించిన నివేదిక అందించారు.






