- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ గడువు పొడగింపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) గడువు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ఎత్తిపోతల పతాకంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ను మరోసారి పొడగించింది సర్కార్. జస్టిస్ పీసీ ఘోష్ ఈనెల 23న తెలంగాణకు రానున్న నేపథ్యంలో కమిషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంచుతూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దఫా మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో సహ.. గత ప్రభుత్వంలోని కొంతమంది బడా నాయకులను కూడా పిలవనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించగా.. అందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి(Medigadda barrage) కుంగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరపడానికి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.






