ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

by Disha Web Desk 19 |
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వాస్తవానికి ఈ గడువు మంగళవారంతో ముగియాల్సి ఉంది. గడువు పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆయా కాలేజీల యాజమాన్యాల నుంచి వస్తున్న రిక్వెస్టుల మేరకు ఈ నెల 19వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆన్ లైన్ పద్ధతిలో పేమెంట్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇదిలా ఉండగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించి గడువును బుధవారం వరకు పొడిగించారు. కాగా నేటితో ఈ గడువు పూర్తి కానుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.



Next Story