Big Breaking: ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర భద్రత.. హోంశాఖ కీలక నిర్ణయం!

by Satheesh |
Big Breaking: ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర భద్రత.. హోంశాఖ కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: తన భర్తను హత్య చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడంటూ ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఇవాళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి నుండి తన భర్తకు ప్రాణ హాని ఉందని ఈటల జమున ఆరోపించిన గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కేంద్ర భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈటల రాజేందర్‌కు ‘‘వై కేటగిరి’’ భద్రత కల్పిస్తున్నట్లు ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read..

ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Next Story

Most Viewed