- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండోమెంట్ ఆఫీస్లో ‘ధర్మవాణి’
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమమైన ‘ధర్మవాణి’కి శ్రీకారం చుట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమమైన ‘ధర్మవాణి’కి శ్రీకారం చుట్టారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలోఉద్యోగులు, అర్చకులు లేదా ఇతరులు ఎవరైనా సరే డైరెక్టర్ను నేరుగా కలవొచ్చని తెలిపారు. ఈ ‘ధర్మవాణి’ కార్యక్రమంలో ధర్మబద్ధమైన సమస్యలను తక్షణమే లేదా గరిష్టంగా వారం రోజులలో పరిష్కరిస్తామని కమిషనర్/డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. శాఖ ప్రధాన కార్యాలయం, డీసీ, ఏసీ, ఈఓ కార్యాలయాల్లో చేయాల్సి ఉండి చేయని పనులు లేదా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు పరిష్కారమైన తర్వాత సంబంధిత వ్యక్తులకు కార్యాలయం నుండి సమాచారం అందజేస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కరించలేని సమస్యల విషయంలో ఎందుకు పరిష్కరించలేకపోయామో కూడా వివరంగా తెలియజేస్తామని తెలిపారు.






