ఆ సాకుతోనే తెలంగాణకు వచ్చారని ఓయూలో మోడీ దిష్టిబొమ్మ దహనం

by Disha Web Desk 2 |
ఆ సాకుతోనే తెలంగాణకు వచ్చారని ఓయూలో మోడీ దిష్టిబొమ్మ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 లోని హామీలను నెరవేర్చకుండా కేంద్రం మోసం చేసిందని బీఆర్ఎస్వీ నేతలు మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సదర్భంగా బీఆర్ఎస్వీ నేతలు మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని అన్నారు. వందేభారత్‌ రైలు సాకుతో తెలంగాణ పర్యటనకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేష్, బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ కాటం శివ, మేకల రవి, రమేశ్ గౌడ్, నాగరాజు, ప్రశాంత్, శీను నాయక్, మిద్దె సురేశ్, రేణు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed