బ్రేకింగ్: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. బోర్డు చైర్మన్, సెక్రటరీకి ఈడీ నోటీసులు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. బోర్డు చైర్మన్, సెక్రటరీకి ఈడీ నోటీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే బోర్డు ఉద్యోగులు సత్యనారాయణ, శంకర్​లక్ష్మిని కార్యాలయానికి పిలిపించుకుని విచారించిన ఈడీ అధికారులు తాజాగా బోర్డు ఛైర్మన్, సెక్రటరీలను ప్రశ్నించారు. రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్​ జరిగినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఈడీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు పబ్లిక్​ డొమైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఈడీ అధికారులు టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 31లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే కాన్ఫిడెన్షియల్​రూం ఇన్​ఛార్జ్​శంకర్​లక్ష్మితో పాటు మరో ఉద్యోగి సత్యనారాయణను కొన్నిరోజుల క్రితం బషీర్​బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా వచ్చాయన్న అంశంపై ప్రశ్నించారు. తాజాగా నోటీసులు జారీ చేసి మరీ బోర్డు ఛైర్మన్​జనార్ధన్​రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్‌లను సోమవారం తమ కార్యాలయానికి పిలిపించుకుని ఈడీ అధికారులు విచారించారు. కాన్ఫిడెన్షియల్​రూంలోని కంప్యూటర్​నుంచి ప్రశ్నాపత్రాలు ఎలా లీకయ్యాయి? బోర్డు ఉద్యోగుల పాత్ర తదితర అంశాలపై ఇద్దరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని రికార్డు చేశారు.

Next Story