- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka: ఈసీ తీరు అత్యంత ప్రమాదకరం.. విశాఖలో భట్టి విక్రమార్క
by Prasad Jukanti |
ఓటు చోరీ అంశంపై భట్టి విక్రమార్క ఈసీపై విమర్శలు గుప్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ చోరీ విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పందించకుండా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకే అనుకూలంగా వ్యవహరహించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. ఓట్లను తొలగిచండం అంటే పౌర హక్కులను కాలరాయడమేనని ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ లబ్ధి పొందుతున్నదని విమర్శించారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యేందుకు భట్టి విక్రమార్క ఏపీలోని విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటు చోరీ జరిగిన తీరును కళ్లకు కట్టేవిధంగా రాహుల్ గాందీ దేశ ప్రజలకు నిరూపించారన్నారు. బిహార్ లో రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ అధికార్ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.
Next Story






