- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలి లో మరోసారి డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా కదలికలు మళ్లీ చెలరేగాయి.

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ పార్టీ (Drug Party)ని పోలీసులు భగ్నం చేశారు. కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా (Drug mafia) కదలికలు మళ్లీ చెలరేగాయి. ఐటీ హబ్ గచ్చిబౌలిలో కో-లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న రహస్య డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో వారి వద్ద నుంచి ఎండీఎంఏ (MDMA), గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు విక్రయిస్తున్న ప్రధాన స్మగ్లర్ గుత్తా తేజ కృష్ణ ఈ నెట్వర్క్కు నాయకత్వం వహిస్తున్నాడు.
తనతో పాటు డ్రగ్స్ సరఫరా లో పాల్గొన్న ఒక నైజీరియన్ పౌరుడిని కూడా గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇద్దరూ కలిసి కర్ణాటక నుంచి మాదక ద్రవ్యాలను రవాణా చేసి, నగరంలోని యువతకు అమ్ముతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడి సందర్భంగా పోలీసులు గెస్ట్ రూమ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న పలు యువకులను పట్టుకున్నారు. డ్రగ్స్ పార్టీలు, స్మగ్లింగ్ మార్గాలు, సరఫరా నెట్వర్క్పై పోలీసులు మరింత విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి నగరంలో డ్రగ్స్ మాఫియా, యువతలో వ్యసన అలవాట్లపై ఆందోళన వ్యక్తమవుతోంది.






