‘క్షమాపణ చెప్పకపోతే.. రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాం’

by Disha Web Desk 2 |
‘క్షమాపణ చెప్పకపోతే.. రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘యాదవ్, కురమలకు పెండ పిసకడం తెలుసు.. నీ రాజకీయ భవిష్యత్ లేకుండా పీక పిసకటం తెలుసు.. అనుచిత వాఖ్యలు చేస్తే బరాబర్ నీ కుతిక పిసకడం కూడా తెలుసు’ అని రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై దుషిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధరహిత పదజాలంతో కూసంస్కారంగా పెండ పిసకే వారి గురించి ఏం మాట్లాడుతా.. అంటూ మంత్రిని ఉద్దేశించి మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. యాదవ కురుమలను చీకటి బతుకులలో వెలుగులు నింపడం కోసం, ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని, గర్వంగా గౌరవంగా బతికేందుకు తలసాని కృషి చేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున అందోళనలు చేపడతామని, యాదవ కురుమల దెబ్బందో చూపిస్తాం అని హెచ్చరించారు. ఓటుకు నోటు, ఆర్టీఐలతో ఇతరులపై బెదిరింపులు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి, చిల్లర శేష్టలతో, చిల్లర మల్లర రాజకీయాలు చేయటం అనేది కాంగ్రెసు అధ్యక్షుడి హోదాలో తగదని హితవు పలికారు. నిన్ను రానున్న రోజుల్లో ఖచ్చితంగా, బహుజన ఓట్లతో రేవంత్‌ను రాజకీయ భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. యాదవ్ కురుమలను విమర్శించే రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన మాటలా లేక కాంగ్రెసు మాటలా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పష్టత ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెసు పార్టీ బాధ్యత వహించాలని, రేవంత్ రెడ్డిని ప్రజా క్షేత్రంలో యాదవ్ కురుమలు అడ్డుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపు నిచ్చారు.

Next Story

Most Viewed