బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల దాడి కలకలం

by Disha Web Desk 4 |
బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల దాడి కలకలం
X

దిశ, బైంసా: రాష్ట్రంలో కుక్కల దాడులు సంచలనంగా మారిన వేళ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ‌ విద్యార్థులపై కుక్కలు దాడి చేశాయి. నిన్న సాయంత్రం వేళా ఎగ్జామ్ రాసి.. క్యాంపస్ హాస్టల్‌కి వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులపై బయట నుండి వచ్చిన కుక్కలు దాడి చేశాయి. విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు ఎగ్జామ్స్ కూడా హాజరైనట్లు తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కుక్కలు వదలడం లేదంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed