- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓయూలో ఇకపై ధర్నాలు, నిరసనలు నిషేధం.. సర్క్యులర్ జారీ

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నో ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్లోని (Osmania University) ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలకు నిషేధం విధించారు. ఈ మేరకు తాజాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు. కానీ విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయడం వలన పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోంది అంటూ యూనివర్సిటీ సర్క్యులర్ ఇచ్చారు. యూనివర్సిటీ రూల్స్ అతిక్రమించడం, ధర్నాలు ఆందోళనలు చేయడం, నినాదాలు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది తమ అధికారిక విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటివి చేయవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్సిటీ సిబ్బంది అధికారులపై అన్ పార్లమెంటరీ నీచమైన భాషను ఉపయోగించడం లాంటివి నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు లేకుండా వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More..
ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్.. ఇంతకీ ఏం జరిగింది..
ఈ నిషేధంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న సీఎం, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్ లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోందన్నారు.
విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఇటీవలి సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని విమర్శించారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయం.. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదు.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.