Delhi liquor scam: శరత్ చంద్రారెడ్డికి బెయిల్ పొడిగింపు

by Disha Web Desk 13 |
ED
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ పొడిగించింది. మరో వారం రోజుల పాటు ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 1న నాలుగు వారాల పాటు శరత్ చంద్రారెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తన భార్య ఆరోగ్యం, సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని శరత్ చంద్రరెడ్డి కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్ ను మరో వారం పాటు పొడిగించింది.

Next Story

Most Viewed