ప్రతిపక్షాల దుష్ప్రచారంతో ఆ రంగానికి నష్టం.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
ప్రతిపక్షాల దుష్ప్రచారంతో ఆ రంగానికి నష్టం.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్‌లో భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సాగునీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు తాను మీడియాకు ముందుకు వచ్చా అన్నారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయన్నారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారన్నారు.

Next Story

Most Viewed