- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంజన్నా ఆర్సీబీ కప్పు కొట్టాలన్నా.. ఐపీఎల్ గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తా
ఐపీఎల్ సీజన్ 18లో ఆర్సీబీ ఫైనల్కు దూసుకుపోవడంతో టీమ్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.

ఐపీఎల్ సీజన్ 18లో ఆర్సీబీ ఫైనల్కు దూసుకుపోవడంతో టీమ్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టాలని తాజాగా ఓ అభిమాని కొండగట్టు అంజన్న హుండీలో చీటీ రాసి వేశాడు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా అంటూ ప్లకార్డును స్టేడియంలో ప్రదర్శించింది. ఈ రెండు సంఘటనకు సంబంధించిన వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
బీఆర్ఎస్లో చార్పత్తా ఆట నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ డ్రామా నడుస్తోందని విమర్శించారు. కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తున్నదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కవిత చిట్ చాట్లపై బండి సంజయ్ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీలో పింఛన్ల పండగ ఒక రోజు ముందే మొదలైంది. సాధారణంగా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ చేపడతారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా ఇవాళే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయ, ఇతర అధికారులు ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు కోనసీమ అంబేడ్కర్జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పొద్దున్నే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఇవాళ ఒక్క రోజే ఎన్ని కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






