HYD: కార్పొరేటర్‌కు వినూత్న బహుమతి

by Disha Web Desk 2 |
HYD: కార్పొరేటర్‌కు వినూత్న బహుమతి
X

దిశ, ఎల్బీనగర్: నిత్యం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి అన్నారు. సోమవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులతో కలిసి కొప్పుల నర్సింహ్మా రెడ్డి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాలనీ సభ్యులు వినూత్నంగా ములక్కాయలు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ భవన అదనపు నిర్మాణ పనులు, చిల్డ్రన్స్ పార్క్‌లో సౌకర్యాలకు చర్యలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తన దృష్టికి కాలనీ వాసులు తీసుకురావడం జరిగిందన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు విజయ భాస్కర్ రెడ్డి, భాస్కర చారీ, మధుసూదన్, కిషన్, పద్మా రెడ్డి, రంగయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story