గోదావరిలో ఇసుక తరలింపును నియంత్రించండి.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

by Disha Web Desk 1 |
గోదావరిలో ఇసుక తరలింపును నియంత్రించండి.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
X

దిశ, వెబ్‌డె‌స్క్‌ : ఓవర్ లోడు వచ్చే లారీలతో రహదారుల అస్తవ్యస్తంగా తయారయ్యాయని, గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. రోడ్ల ధ్వంసంతో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండటంతో ఇసుక లారీలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేడారం జాతర ఏర్పాట్ల విషయంలో అలసత్వం వహిస్తే ఏ ఒక్కరినీ సహించేది లేదన్నారు. అధికారులను అయితే ఇంటికి వెళ్తారని.. కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్‌లో వెస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు.


Next Story