గడువులోగా BRS కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలి : మంత్రి వేముల

by Disha Web Desk 4 |
గడువులోగా BRS కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలి : మంత్రి వేముల
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిర్ణీత గడువులోగా బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. కేంద్ర కార్యాలయ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్‌పై మంత్రి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేసారు. కార్యాలయ ఫర్నీచర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట ఆర్కిటెక్ట్ ఆస్కార్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.


Next Story

Most Viewed