మునుగోడుకు ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన

by Disha Web Desk 2 |
మునుగోడుకు ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. 38 మందితో కూడిన జాబితాను శుక్రవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఆ జాబితాను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల సంఘానికి అందజేసింది. కాగా, మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు స్వార్థం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డికి ఎలాగైనా ఈ బైపోల్‌లో గెలిచి బుద్ధి చెప్పాలని చూస్తోంది.


Next Story

Most Viewed