- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ మూడోసారి సీఎం అయితే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ లాగా అయ్యేది.. అద్దంకి దయాకర్ కౌంటర్
కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ దేశాలుగా అయ్యేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ (KCR) మూడో సారి అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ దేశాలుగా అయ్యేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఘాటు విమర్శలు చేశారు. ఫాంహౌజ్లో పార్టీ నేతల భేటీలో కేసీఆర్ చేసిన కామెంట్లపై అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలకు చెప్పాలంటున్న కేసీఆర్ తన కూతురు కవిత పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్లిందో చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేయాలనుకున్నారని, రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లిపోతే తమ సీఎం రేవంత్రెడ్డి ఆ అప్పులను తీర్చి పరిస్థితులు చక్కదిద్దు తున్నారని, ఆ విషయం కేసీఆర్ మెచ్చుకునేది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. రేవంత్ తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా మెరుగు పరుస్తున్నారని దయాకర్చెప్పారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు సైకోలు, కాలకేయుల్లాగా దాడి చేస్తున్నారని, కేసీఆర్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని ఆయన మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్రావులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీరు రాజకీయ నేతలేనా అనే సందేహాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇదే పరిస్థితిని బీఆర్ఎస్ కొనసాగిస్తే తెలంగాణ నుంచి ఆ పార్టీ మాయం అవుతుందని అద్దంకి దయాకర్ అన్నారు.






