గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఎక్కడకు పోయాయి?

by Disha Web Desk 2 |
గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఎక్కడకు పోయాయి?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత గ్యాంగ్‌స్టర్ నయీం కేసును మళ్లీ తెరిచి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం కేసులో పోలీసు అధికారుల పాత్ర తేల్చాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును నీరుగార్చిందని అన్నారు. నయీమ్ కేసులో ఉన్న నాయకులు, పోలీసు అధికారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నయీంకు చెందిన వందల కోట్ల ఎకరాలు, పేదల భూములు ఎక్కడకు పోయాయి? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారిందని.. దీనిని కూడా సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీస్ అధికారులు జైలుకు పోయారని.. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story