తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. వెంటాడి మరీ పబ్లిక్‌గా గొంతు కోసిన దుండగులు

by Disha Web Desk 2 |
తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. వెంటాడి మరీ పబ్లిక్‌గా గొంతు కోసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నిండు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పబ్లిక్ మీటింగ్ నుంచి తరుముకుంటూ వెళ్లి.. వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. దుండగులు వెంటాడటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed